ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'చర్చి ఫాదర్ అరెస్టుకు యత్నం...అడ్డుకున్న క్రైస్తవులు'

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆర్సీఎమ్ చర్చి వద్ద మంగళవారం రాత్రి ఘర్షణ వాతావరణం నెలకొంది. చర్చి ఫాదర్​పై వచ్చిన ఆరోపణలతో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా...స్థానిక క్రైస్తవులు వారిని అడ్డుకున్నారు. చర్చి ఫాదర్​ను అరెస్టు చేయనీకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

By

Published : Jun 12, 2019, 6:29 AM IST

'చర్చి ఫాదర్ అరెస్టుకు యత్నం...అడ్డుకున్న క్రైస్తవులు'

'చర్చి ఫాదర్ అరెస్టుకు యత్నం...అడ్డుకున్న క్రైస్తవులు'
అనంతపురం జిల్లా తాడిపత్రి ఆర్సీఎమ్ చర్చి ఫాదర్ ఏమిలిరాజును అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులను క్రైస్తవులు అడ్డుకున్నారు. చర్చి ఫాదర్ రాజు రెండు నెలల క్రితం 13 ఏళ్ల బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ బాలిక తల్లి కమలమ్మ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫాదర్ ఏమిలిరాజు కోసం గాలింపు మొదలుపెట్టారు. మంగళవారం రాత్రి ఏమిలిరాజు ఆర్సీఎమ్ చర్చిలో ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ సమాచారంతో పట్టణ సీఐ చిన్న గోవింద్, ఎస్సైలు శ్రీధర్, జగదీష్...ఫాదర్​ను అదుపులోకి తీసుకునేందుకు చర్చిలోకి వెళ్లడానికి ప్రయత్నించారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక క్రైస్తవులు పోలీసులను అడ్డుకున్నారు. కమలమ్మ ఆరోపణలలో అసత్యమని, చర్చి ఫాదర్ మంచివాడంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ చర్యతో చర్చి వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. క్రైస్తవులు ఫాదర్ ఉన్న ఇంటికి తాళం వేసి ఇంట్లోకి పోలీసులు వెళ్ళకుండా అడ్డుకున్నారు. పోలీసులు మరో ద్వారం ద్వారా ఇంట్లోకి ప్రవేశించి ఫాదర్ కోసం గాలించగా..అప్పటికే ఫాదర్ పరారయ్యాడు. స్థానిక యువకులే ఫాదర్​ను తప్పించారని అక్కడున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో యువకుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తమ పిల్లలను వదిలివేయాలంటే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ జయ రామసుబ్బారెడ్డి ఠాణా వద్దకు చేరుకుని..తల్లిదండ్రులతో మాట్లాడి యువకులను వదిలిపెట్టారు. అంతటితో ఆందోళన సద్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details