ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కౌంటింగ్​కు సర్వం సిద్ధం: కలెక్టర్ కార్తికేయ మిశ్రా

కౌంటింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పటిష్ఠ పోలీసు భద్రత కల్పించినట్లు వెల్లడించారు.

By

Published : May 22, 2019, 6:40 PM IST

కౌంటింగ్​కు సర్వం సిద్ధం : కలెక్టర్ కార్తికేయ మిశ్రా

కౌంటింగ్​కు సర్వం సిద్ధం : కలెక్టర్ కార్తికేయ మిశ్రా

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూలోని లెక్కింపు కేంద్రాన్ని ఎస్పీ విశాల్ గున్నీతో కలిసి ఆయన పరిశీలించారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రంలోకి మొబైల్స్ అనుమతించబోమన్నారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత వీవీప్యాట్లు లెక్కిస్తామన్నారు. విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని కలెక్టర్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details