ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

భూతల స్వర్గంగా కశ్మీర్​

రెండు రోజులుగా కురుస్తోన్న మంచుతో జమ్ముకశ్మీర్​ భూతల స్వర్గంగా మారింది. హిమాచల్​ ప్రదేశ్​లోని షిమ్లాలోనూ ఆహ్లాద వాతావరణం చూపరుల్ని కట్టిపడేస్తోంది.

By

Published : Feb 8, 2019, 9:55 AM IST

భూతల స్వర్గంగా కశ్మీర్​

భూతల స్వర్గంగా కశ్మీర్​
మంచు జల్లు కశ్మీర్​ అందాలను మరింత పెంచుతోంది. ఎటు చూసినా హిమపాతంతో నిండిన ప్రాంతాలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. షిమ్లాలో తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్నదా అనే విధంగా దృశ్యాలు పర్యటకుల మదిని దోచుకుంటున్నాయి.

రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో ఓ పక్క అందమైన దృశ్యాలు దర్శనమిస్తుంటే మరో పక్క జనజీవనానికి ఇబ్బందులు తప్పడం లేదు. దారుల్లో పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అవస్థలు పడుతున్నారు.

డోడా, రాజౌరీ​ జిల్లాల్లో భారీగా కురుస్తున్న మంచుతో ప్రయాణాలు రద్దు చేసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు అధికారులు.

ABOUT THE AUTHOR

...view details