ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

ఎన్నార్సీని గడువులోపే పూర్తి చేస్తాం: రాజ్​నాథ్

సుప్రీం కోర్టు మందలింపుతో అసోంలో పౌరసత్వ నమోదును గడువులోనే పూర్తి చేస్తామని రాజ్​నాథ్ సింగ్ ప్రకటించారు.

By

Published : Feb 6, 2019, 6:44 AM IST

ఎన్నార్సీని గడువులోపే పూర్తి చేస్తామని ప్రకటించిన రాజ్​​నాథ్

ఎన్నార్సీని గడువులోపే పూర్తి చేస్తామని ప్రకటించిన రాజ్​​నాథ్
అసోంలో పౌరసత్వ నమోదును గడువులోపే పూర్తి చేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ మంగళవారం స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఉండదనీ.. ఏ ఒక్క పౌరుడికి అన్యాయం జరగదనీ మంత్రి హామీ ఇచ్చారు.

ఎన్నార్సీ ప్రక్రియపై దృష్టి సారించడం లేదని, సాకులు చెబుతూ సమయం వృథా చేస్తున్నారని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు మంగళవారం మందలించింది. దీనికి రాజ్​నాథ్​ గడువులోనే పూర్తి చేస్తామని స్పందించారు. పౌరసత్వ జాబితాకు చివరి గడువు 2019 జులై 31 మాత్రమేనని సుప్రీం మరోసారి స్పష్టం చేసింది.

1985లోనే అసోంలో ఎన్నార్సీకి సమ్మతి లభించినా, ముప్పై ఏళ్ల పాటు ఎవరూ పట్టించుకోలేదని రాజ్​నాథ్ గుర్తు చేశారు. ఎన్డీయే ప్రభుత్వమే ఈ ప్రక్రియను బాధ్యతగా స్వీకరించిందని, ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని తెలిపారు.

ఎన్నార్సీ చివరి జాబితా 2018 జులై 30న సిద్ధం చేశారు. దీనిపై అభ్యర్థనలు, ఆరోపణల స్వీకరణ 2018 డిసెంబర్​ 31తో పూర్తైంది. అయితే జాబితాలో 40 లక్షల మంది పేర్లు గల్లంతు కావటంపై వివాదం రాజుకుంది. మొత్తం 3.29 కోట్ల మందికి గాను 2.9 కోట్ల మంది పేర్లు మాత్రమే జాబితాలో పొందుపరిచారు.

ABOUT THE AUTHOR

...view details