ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 5, 2019, 6:29 PM IST

ETV Bharat / bharat

కమిషనర్​ ధర్నాలో కూర్చోవడంపై కేంద్రం చర్యలు...

ధర్నాలో కూర్చుని అఖిల భారత సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించారని కోల్​కతా పోలీస్​ కమిషనర్ రాజీవ్​కుమార్​పై చర్యలకు కేంద్రం ఆదేశాలు

కోల్​కతా కమిషనర్​పై కేంద్ర హోంశాఖ చర్యలు

కోల్​కతా పోలీస్​ కమిషనర్​ రాజీవ్ కుమార్​పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ పశ్చిమ బంగ ప్రభుత్వానికి సూచించింది. ధర్నాలో కూర్చుని అఖిల భారత సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పశ్చిమ బంగ ప్రధాన కార్యదర్శి పేరిట ఈ ఆదేశాల్ని విడుదల చేశారు.

రాజీవ్​ కుమార్ సహా పలువురు పోలీసులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ధర్నాలో కూర్చోవడం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ.

గవర్నర్ నివేదికతోనే చర్యలు..

సీబీఐ వ్యవహారంపై కోల్​కతాలో ఆదివారం రాత్రి నుంచి జరుగుతోన్న వరుస పరిణామాలపై గవర్నర్​ కేసరినాథ్ త్రిపాఠి కేంద్ర హోంమంత్రిత్వశాఖకు (రాజ్​నాథ్​ సింగ్)​కు సమగ్ర నివేదిక సమర్పించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

శారదా కుంభకోణం విషయంలో కోల్​కతా పోలీస్​ కమిషనర్ రాజీవ్​కుమార్​ను ప్రశ్నించడానికి వెళ్లిన సీబీఐ అధికారులను నిర్బంధించడంతో వివాదం మొదలైంది. కోల్​కతా పోలీసులకు అండగా నిలిచి మమత బెనర్జీ సత్యాగ్రహం చేపట్టారు. పశ్చిమ బంగను నాశనం చేయడానికి మోదీ-షా ద్వయం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

సీబీఐ అధికారులకు ముప్పు ఉందనే సమాచారంతో వారి భద్రత కోసం కేంద్ర రిజర్వ్​ దళాలను కోల్​కతాకు పంపారు.

ఎవరీ రాజీవ్​కుమార్​..

1989 ఐపీఎస్​ బ్యాచ్​కు చెందిన రాజీవ్​కుమార్​ శారదాకేసును దర్యాప్తు చేశారు. అయితే ఆ కేసుకు సంబంధించిన నివేదికలు, దస్త్రాలు సీబీఐకి అప్పగించకుండా అతను దాస్తున్నట్లు సీబీఐ ఆరోపించింది. అదే విధంగా ఎన్నికల సన్నద్ధత ఏర్పాట్లను పరిశీలిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికీ హాజరుకాలేదని అతనిపై ఆరోపణలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details