national

విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్న వరద పరిస్థితులకు జగనే కారణం: మంత్రి పార్థసారథి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 10:39 AM IST

Pardhasaradhi Comments on YSRCP
Pardhasaradhi Comments on YSRCP (ETV Bharat)

Minister Pardhasaradhi Comments on YSRCP:విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్న వరద పరిస్థితులకు మాజీ ముఖ్యమంత్రి సీఎం జగనే కారణమని సమాచార శాఖ మంత్రి పార్థసారథి విమర్శించారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లకు వైఎస్సార్సీపీ రంగులు ఉండటంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వ్యవస్థల్ని ధ్వంసం చేసే మనస్తత్వంతో కాలవ గట్లపై మట్టి కూడా దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే బాధ్యతతో వ్యవహరించకుండా బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1995లో తీసుకున్న నిర్ణయాలను ఈనాటి బుడమేరుతో కలిపే అజ్ఞానం ఒక్క అంబటి రాంబాబుకే సాధ్యమని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details