By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 27, 2024, 3:21 PM IST
అల్లూరి జిల్లాలో లొంగిపోయిన మావోయిస్టులు - పోలీసులకు ప్రశంసాపత్రాలు
Four Maoists Surrendered Before SP Tuhin Sinha in Alluri District:అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఎస్పీ తుహిన్ సిన్హా (SP Tuhin Sinha) ఎదుట నలుగురు మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. గాలికొండ ఏరియా కమిటీ మావోయిస్టు దళానికి వీరు సహాయ సహకారాలు అందించేవారని ఎస్పీ వెల్లడించారు. వీరంతా గాలికొండ ఏరియా కమిటీ ఆచూకీ లేకపోవడం వల్ల జనజీవన స్రవంతులు కలిస్తే కేసులు ఎత్తివేయడం ఇతర సదుపాయాల వల్ల లొంగిపోయినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు.