Case Filed Against MLA Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది. జిల్లా పరిషత్ సమావేశంలో డీఈఓపై చర్యలు తీసుకోవాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సమావేశానికి హాజరైన కలెక్టర్ పమేల సత్పతి సమావేశం నుంచి వెళ్తున్న క్రమంలో ఆమెను అడ్డుకుని బైఠాయించారు. అంతేకాకుండా సమావేశం రసాభసాగా కొనసాగింది. ఈ క్రమంలో సమావేశంలో గందరగోళం నెలకొంది.
కొత్త చట్టం కింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
Published : Jul 3, 2024, 10:06 AM IST
![కొత్త చట్టం కింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు Huzurabad MLA Kaushik Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-07-2024/1200-675-21855897-thumbnail-16x9-huzurabad.jpg)
Huzurabad MLA Kaushik Reddy (ETV Bharat)
ఈ ఘటనపై మంగళవారం రోజున జడ్పీ సీఈఓ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు ప్రభుత్వ అధికార యంత్రాంగం విధులకు ఆటంకం కలిగించినందుకు భారత న్యాయ సంహిత సెక్షన్ 122, 126(2) కింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీంతో దేశంలోనే కొత్త చట్టాల కింద కేసు నమోదు అయిన తొలి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి నిలిచారు.