ఆ ఎమ్మెల్యేలిద్దరినీ ప్రభుత్వ విప్లుగా ప్రకటించండి - చంద్రబాబుకు పవన్ లేఖ
Published : Jul 1, 2024, 4:35 PM IST
![ఆ ఎమ్మెల్యేలిద్దరినీ ప్రభుత్వ విప్లుగా ప్రకటించండి - చంద్రబాబుకు పవన్ లేఖ Pawan Letter to Chandrababu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-07-2024/1200-675-21840256-thumbnail-16x9-pawan.jpg)
Pawan Kalyan Letter to Chandrababu (ETV Bharat)
Pawan Kalyan Letter to Chandrababu : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యులను ప్రభుత్వ విప్లుగా ప్రకటించాలని కోరారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను విప్లుగా నియమించాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసినట్లు పవన్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఓ ప్రకటనలో వెల్లడించారు.