ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 9:14 AM IST

ETV Bharat / videos

భీమనపల్లి వద్ద జీపు బోల్తా పడి ఇద్దరు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు

Jeep Accident then Two People Died at Bhimanapalli: అల్లూరి జిల్లా చింతపల్లి మండలం భీమనపల్లి వద్ద జీపు బోల్తా పడి ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రయాణికులతో వెళ్తున్న జీపు మండలంలోని మారుమూల గ్రామాలైన సంపంగిపుట్టు, భీమనపల్లి మధ్యలో సోమవారం సంత నుంచి తిరిగి వెళుతూ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పది మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్సులో లోతుగెడ్డ ఆస్పత్రికి తరలించారు. 

వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో మెరికల గ్రామానికి చెందిన వంతల అప్పారావు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వారిని పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.  అన్నవరం వారపు సంతకు వచ్చి తిరిగి వెళ్తూ గిరిజనులు ఈ ప్రమాదానికి గురయ్యారు. మారుమూల ఘాట్‌రోడ్డు పరిమితికి మించి అధిక సంఖ్యలో ప్రయాణికులను తీసుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

ABOUT THE AUTHOR

...view details