ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Live: భోగాపురం ఎయిర్​పోర్టు స్థలాన్ని పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - CM Visit Bhogapuram Airport

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 1:38 PM IST

Updated : Jul 11, 2024, 3:01 PM IST

CM Chandrababu Naidu Visit Bhogapuram Airport Live : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి దార్లపూడివద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. తర్వాత భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరో రెండు రెండోళ్లలో పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 2015లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సీఎం చంద్రబాబు, అప్పటి కేంద్రమంత్రి అశోక్​ గజపతిరాజుల ఆలోచన నుంచే ఈ ప్రాజెక్ట్​ పుట్టింది. దీనిని దేశంలోనే నంబర్​వన్​గా తీర్చిదిద్ది 2026 నాటికి అందుబాటులోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అనంతరం సీఐఐ కాన్ఫరెన్స్‌లో వర్చువల్‌గా పాల్గొంటారు. మెడ్‌టెక్‌ జోన్‌ వర్కర్లతో సమావేశమవుతారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అధికారులతో సమావేశమై ఐదేళ్లుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షిస్తారు. రాత్రికి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
Last Updated : Jul 11, 2024, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details