ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జలవిలయంతో అల్లాడుతున్న విజయవాడ - బాధితులకు అండగా స్వచ్ఛంద సంస్థలు - Help to Vijayawada Flood Victims

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 11:46 AM IST

Help to Vijayawada Flood Victims : జలవిలయంతో అల్లాడుతున్న విజయవాడ ప్రజల్ని ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఆహారం, సామగ్రి, డబ్బుతో పాటు ఇతర వస్తువుల రూపంలో తమవంతుగా సాయం అందిస్తున్నారు. కష్టకాలంలో ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు.

Help to Vijayawada Flood Victims
Help to Vijayawada Flood Victims (ETV Bharat)

Vijayawada Floods Updates : ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ విజయవాడ వరద ముంపు బాధితులకు రూ.25 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ మేర సాయం అందిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. రేపటి కోసం తమ సామాజిక బాధ్యతగా ఈ మొత్తం అందిస్తున్నట్లు వెల్లడించింది.

బాధితులకు అండగా కమ్మజన సేవా సమితి వసతిగృహం :ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు గుంటూరు కమ్మజన సేవా సమితి వసతిగృహం తరపున ఆహారాన్ని పంపించారు. వెజిటేబుల్‌ బిర్యాని, పెరుగన్నం, వాటర్‌ బాటిల్స్‌ను 1500 మందికి సిద్ధం చేసి విజయవాడకు పంపామని అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు తెలిపారు . ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖకు వీటిని అందించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా దుప్పట్లు, వంట సామగ్రిని అందించేందుకు నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

మరోవైపు వరద బాధితుల కోసం గుంటూరు జిల్లా మంగళగిరి అక్షయపాత్ర వంటశాలలో ప్రభుత్వం మంచి రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందిస్తోంది. రోజుకు సుమారు 3 లక్షల మందికి సిద్ధం చేస్తున్నారు . సాంబారన్నం, పెరుగన్నాన్ని తయారు చేస్తున్నారు. మనుషుల ప్రమేయం లేకుండానే లక్షల మందికి ఆహారం సిద్ధమవుతోంది. ఇలా తయారైన వాటిని మంగళగిరి నగరపాలక సంస్థ సిబ్బంది ప్యాకింగ్ చేస్తున్నారు. సుమారు వందల సంఖ్యలో మంది డ్వాక్రామహిళలు ప్యాకింగ్ చేసిన ఆహారాన్ని వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పులో 20,000ల మందికి విజయవాడలోని వరద బాధితుల కోసం పంపుతున్నారు.

Organizations Help to Flood Victims :చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం చెందిన కేఎస్ఆర్ ఫ్రెండ్ సర్కిల్, చిలకలూరిపేట తహసీల్దార్ ఆధ్వర్యంలో 4,000ల ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ సిద్ధం చేసి పంపారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో అందరూ ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే విజయవాడ,గుంటూరు, రేపల్లెలోని తన క్యాంపు కార్యాలయాలను పునరావాస కేంద్రలుగా రెవెన్యూ అధికారులు ఉపయోగించుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. గతంలో వరదల వల్ల కోతలకు గురైన కరకట్టల మరమ్మతు పనులను రెవెన్యూ అధికారులు వెంటనే చేపట్టాలన్నారు. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కరకట్టలు దెబ్బతిన్నాయన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన చోట్ల కరకట్ట పనులను వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

కృష్ణమ్మ మహోగ్రరూపం - విలవిల్లాడుతున్న లంక గ్రామాలు - క్షణం క్షణం కమ్మేస్తోన్న వరద - Krishna River Floods

వరద ధాటికి సొంతూళ్లకు పయనం - బస్సుల్లేక బస్టాండ్‌లో బాధితుల తిప్పలు - PEOPLE FACE TO TRANSPORT PROBLEM

ABOUT THE AUTHOR

...view details