Minister Lokesh Met Several Companies Representatives:దావోస్ పర్యటనలో భాగంగా ఐటీ మంత్రి లోకేశ్ వివిధ సంస్థల ప్రతినిధులను పెట్టుబడులకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజమన్నార్తో సమావేశమైన ఆయన రాష్ట్రంలో మాస్టర్కార్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే, దక్షిణాదిలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంటుదని అన్నారు.
కంపెనీ ప్రాధాన్యతైన ఫిన్టెక్కు అనుగుణంగా ఏపీలో ఐటీ వర్క్ ఫోర్స్ తయారీకి అవసరమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని అభ్యర్ధించారు. బోర్డు సభ్యులతో చర్చించి రాష్ట్రంలో కార్యకలాపాల విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని లోకేశ్కు రాజమన్నార్ భరోసా ఇచ్చారు. భారత్లో పెరుగుతున్న క్రెడిట్ అవకాశాలు ఉపయోగించుకొని, భాగస్వాములతో కలిసి సేవలు విస్తరించేందుకు మాస్టర్ కార్డ్ ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు.
విశాఖలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్: మరోవైపు బహుళ జాతి ఐటీ సంస్థ సిస్కో ఉపాధ్యక్షురాలు ప్రాన్సిన్ కట్సౌదాస్నూ లోకేశ్ కలిశారు. విశాఖలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. అమెరికాలోని భారతీయ ఐటీ వర్క్ ఫోర్స్లో 25 శాతానికిపైగా తెలుగువారేనని అన్నారు. భారత్లో అతిపెద్ద ఐటీ టాలెంట్ పూల్ ఉన్న ఆంధ్రప్రదేశ్ సిస్కో దీర్ఘకాల వ్యూహానికి అనువుగా ఉంటుందని, కంపెనీ తయారీ నెట్వర్క్ను విస్తరించాలని కోరారు. కృత్రిమ మేథ, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీలో అత్యంత నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ఫోర్స్ తయారీకి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
సిస్కోకు బెంగుళూరులో విప్రో, ఇన్ఫోసిస్లతో జాయింట్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయన్న కట్సౌదాస్ భారత్లో ఒకటిన్నర బిలియన్ డాలర్లు వెచ్చించి ఫ్లెక్స్ సంస్థ భాగస్వామ్యంతో కాంట్రాక్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. 5 లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై కంపెనీలోని సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సిస్కో ఉపాధ్యక్షురాలు ప్రాన్సిన్ కట్సౌదాస్ లోకేశ్కు భరోసా ఇచ్చారు.
ఏపీలో మెగా సిటీలుగా ఆ ప్రాంతాలు - అమరావతి ఓఆర్ఆర్తో మారనున్న రూపురేఖలు