ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు - కేరళ నుంచి వచ్చిన కృష్ణతేజకు కీలక బాధ్యతలు - IAS Transfers in Andhra Pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 7:43 AM IST

IAS Transfers in Andhra Pradesh: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వీరిలో ఇప్పటికే బదిలీపై పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అధికారులు కొందరు ఉండగా, ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ అయిన వారు అధికంగా ఉన్నారు. మొత్తంగా ఒకేసారి 63 మందికి స్థానచలనం కలిగింది. గత ప్రభుత్వ హయాంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులకు తాజాగా కీలక పోస్టింగులు దక్కాయి.

IAS Transfers in Andhra Pradesh
IAS Transfers in Andhra Pradesh (ETV Bharat)

IAS Transfers in Andhra Pradesh: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటికే విడతల వారీగా సీనియర్ ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్ల నియామకాలను దాదాపుగా పూర్తిచేసింది. తాజాగా పెద్దఎత్తున మార్పులు చేసింది. కార్యదర్శి, డైరెక్టర్ సహా సంయుక్త కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు తదితర స్థానాల్లో నియమించింది.

కేరళ నుంచి ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చిన 2015 బ్యాచ్‌ ఐఏఎస్ అధికారి వీఆర్‌ కృష్ణ తేజ మైలవరపు (IAS Krishna Teja) పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కార్మిక శాఖ కమిషనర్‌గా ఉన్న ఎంవీ శేషగిరిబాబును స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా బదిలీ చేసింది. ఇప్పటి వరకు పదవిలో ఉన్న ఐఆర్​ఎస్ అధికారి వి.రామకృష్ణను అక్కడి నుంచి తప్పించింది. కార్మిక శాఖ కమిషనర్‌ పోస్టును ఎవరికీ ఇవ్వలేదు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా పనిచేసిన చేవూరు హరికిరణ్‌కి ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు జాతీయ ఆరోగ్య మిషన్‌ ఎండీగా అదనపు బాధ్యతల్లోనూ ఆయన కొనసాగుతారు. పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్‌ సెర్ఫ్‌ సీఈవోగా నియమితులయ్యారు.

గృహనిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న పీఎస్ గిరీషా పౌరసరఫరాల సంస్థ ఎండీగా బదిలీ అయ్యారు. చేనేత, జౌళి శాఖ కమిషనర్‌గా రేఖారాణి,మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్ శ్రీధర్‌ని నియమించింది. ఇటీవలి వరకు విశాఖపట్నం కలెక్టర్‌గా పనిచేసిన మల్లికార్జునను బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమిస్తూ, వెనకబడిన తరగతుల సహకార ఆర్ధిక సంస్థ వీసీ, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన హరినారాయణను పురపాలక శాఖ డైరెక్టర్‌గా నియమించింది. విజయనగరం, పల్నాడు జిల్లాల కలెక్టర్గా పనిచేసిన లఠ్కర్‌ శ్రీకేశ్‌ బాలాజీరావు సర్వే సెటిల్మెంట్, భూద స్త్రాల శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. బదిలీ అయిన వారిలో ఐఆర్ఎస్‌, ఐఎఫ్ఎస్‌ అధికారులు కొందరు ఉన్నారు. వారికి పోస్టింగులు ఇవ్వలేదు.

ఏపీలో 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ - డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని పలువురికి ఆదేశాలు - IPS TRANSFERS IN AP

బదిలీ అయిన అధికారులు:

  • కృష్ణ తేజకు పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్​గా పోస్టింగ్
  • మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సి.హెచ్‌.శ్రీధర్
  • సి.హెచ్‌.శ్రీధర్​కు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అదనపు బాధ్యతలు
  • స్టాంపులు, రిజిస్ట్రేషన్‌లు ఐజీ, కమిషనర్‌గా ఎం.వి.శేషగిరి
  • హ్యాండ్లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌ కమిషనర్‌గా రేఖా రాణి
  • ప్రజారోగ్యం, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌
  • నేషనల్‌ హెల్త్‌మిషన్‌ ఎండీగాను హరికిరణ్‌కు అదనపు బాధ్యతలు
  • సెర్ప్‌ సీఈవోగా వీరపాండ్యన్‌
  • మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఎం.హరినారాయణ
  • బీసీ సంక్షేమ డైరెక్టర్‌గా మల్లికార్జున
  • బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా మల్లికార్జునకు అదనపు బాధ్యతలు
  • సాంఘిక, సంక్షేమ శాఖ కార్యదర్శిగాను ప్రసన్నవెంకటేష్‌
  • భూ సర్వే, సెటిల్‌మెంట్‌ల డైరెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీరావు
  • సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఎండీగా గిరిశ్ షా
  • ఏపీ మార్క్‌ఫెడ్‌ ఎండీగా మంజీర్‌ జిలానీ
  • మంజీర్‌ జిలానీకి శాప్‌ ఎండీగా అదనపు బాధ్యతలు
  • ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా కృతికా శుక్లా
  • బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గాను కృతికా శుక్లాకు అదనపు బాధ్యతలు
  • ఎస్పీపీడీసీఎల్‌ సీఎండీగా రవి సుభాష్‌
  • ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా లక్ష్మీ షా
  • ఎన్టీఆర్‌ వైద్య సేవ సీఈవోగాను లక్ష్మీ షాకు అదనపు బాధ్యతలు
  • మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ డైరెక్టర్‌గా ఎం.వేణుగోపాల్‌రెడ్డి
  • అల్లూరి జిల్లా జేసీగా అభిషేక్‌ గౌడ
  • మదనపల్లి సబ్‌ కలెక్టర్‌గా మేఘస్వరూప్‌
  • రాజంపేట సబ్‌కలెక్టర్‌గా వైకోమ్‌ నైదియాదేవి
  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా కృష్ణ తేజ
  • ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా ఉన్న చక్రధర్‌బాబు బదిలీ
  • స్టాంపులు, రిజిస్ట్రేషన్లు ఐజీ రామకృష్ణకు పోస్టింగ్‌ ఇవ్వని ప్రభుత్వం
  • కాకినాడ జేసీగా గోవిందరావు
  • కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఎన్‌.తేజ్‌ భరత్‌
  • కె.ఆర్‌.పురం ఐటీడీఏ పీవోగా డి.హరిత
  • ఏపీ సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌
  • కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌గా భావన
  • ఏపీ సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా మల్లవరపు నవీన్‌
  • నంద్యాల జేసీగా సి.విష్ణు చరణ్‌
  • ఎన్టీఆర్‌ జిల్లా జేసీగా నిధి మీనా
  • రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం
  • తిరుపతి జిల్లా జేసీగా శుభం భన్సల్‌
  • నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌గా మల్లవరపు సూర్యతేజ
  • సీతంపేట ఐటీడీఏ పీవోగా తాటిమాకుల రాహుల్‌కుమార్‌రెడ్డి
  • ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా నూరుల్‌ కమర్‌
  • శ్రీకాకళం జేసీగా ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌
  • కడప జేసీగా అదితి సింగ్‌
  • పార్వతీపురం ఐటీడీఏ పీవోగా మాధవన్‌
  • ఏలూరు జేసీగా పి.ధాత్రిరెడ్డి
  • అన్నమయ్య జిల్లా జేసీగా ఆదర్శ్‌ రాజేంద్రన్‌
  • గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా నవ్య
  • గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌గా దినేష్‌కుమార్‌
  • విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా ధ్యానచంద్ర
  • ఏపీ మారిటైమ్‌ బోర్డ్‌ సీఈవోగా ప్రవీణ్ ఆదిత్య
  • ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్‌గా ప్రవీణ్‌ ఆదిత్యకు పూర్తి అదనపు బాధ్యతలు
  • కోనసీమ జిల్లా జేసీగా నిశాంతి
  • తూ.గో జేసీగా హిమాన్షు కోహ్లీ
  • గుంటూరు జేసీగా అమిలినేని భార్గవ తేజ
  • తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌గా నారపురెడ్డి మౌర్య
  • సీసీఎల్‌ఏ కార్యాలయం జాయింట్‌ సెక్రటరీగా శ్రీవాస్‌ నుపుర్‌ అజయ్‌కుమార్‌
  • పల్నాడు జేసీగా సూరజ్‌ ధనుంజయ్‌
  • గిరిజిన కో-ఆపరేటివ్‌ ఎండీగా కల్పన కుమారి
  • రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌గా కేతన్‌ గార్గ్‌
  • ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ పి.రాజబాబు
  • ఎక్సైజ్‌ శాఖ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌గా నిషాంత్‌కుమార్‌
  • క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్‌ మిషన్‌ ఎండీగా జి.సి. కిషోర్‌కుమార్‌
  • అగ్రికల్చర్‌ మార్కెట్‌ శాఖ డైరెక్టర్‌గా విజయసునీత
  • ఉద్యానశాఖ డైరెక్టర్‌గా కె.శ్రీనివాసులు
  • సాంఘిక, సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా లావణ్య వేణి
  • ఏపీఐఐసీ ఎండీగా అభిషిక్త్‌ కిషోర్‌
  • ఏపీటీడీసీ ఎండీగానూ అభిషిక్త్‌ కిషోర్‌కు అదనపు బాధ్యతలు
  • సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌గా ఏ.సిరి
  • ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌గా రామసుందర్‌రెడ్డి
  • కాడా కమిషనర్‌గా రామసుందర్‌రెడ్డి
  • ఏపీ ట్రాన్స్‌కో జాయింట్‌ ఎండీగా కీర్తి చేకూరి
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా గణేష్‌కుమార్‌
  • టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా గణేష్‌కుమార్‌
  • జీవీఎంసీ మున్సిపల్‌ కమిషనర్‌గా సంపత్‌కుమార్‌

రాష్ట్ర భవిష్యత్​పై సర్కార్​ ఫోకస్​ - ఏపీకి డిప్యూటేషన్​పై ఇద్దరు అధికారులు - Deputation IAS officers to AP

ABOUT THE AUTHOR

...view details