ATMOS 2024 Celebratration on Hyderabad BITS Pilani Campus :దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన టెక్ ఈవెంట్ అట్మోస్ హైదరాబాద్ బిట్స్ పిలానీలో ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్లో విద్యార్థులు భిన్నమైన నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. పూర్తిగా విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో డ్రోన్ రేసింగ్, రోబో వార్స్ లాంటి వాటితో పాటు ఏటీవీ రేసింగ్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలవనుంది. 2012లో ప్రారంభమైన ఈ వేడుకలకు ఈ సారి హైదరాబాద్లోని బిట్స్ పిలానీ యూనివర్సిటీ వేదిక కానుంది.
ప్రస్తుతం జరగనున్న 12వ ఎడిషన్ అట్టహాసంగా సాగుతోంది. ఈ కార్యక్రమానికి ఇస్రో మాజీ ఛైర్మన్ కిరణ్కుమార్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ డైరెక్టర్ పీజే నారాయణతో పాటు కళాశాల, వివిధ విభాగాల ప్రొఫెసర్లు, డైరెక్టర్లు హజరు అయ్యారు. ఈ టెక్నికల్ ఈవెంట్కు దేశంలో నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రంలోని కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు హజరు అయ్యి తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. మొదటి రోజు జరిగిన ఈ వేడుకల్లో టెక్నికల్ ఈవెంట్ హైలైట్గా నిలిచింది. మరో రెండు రోజులు పాటు డ్రోన్ రేసింగ్, ఏటీవీ రేసింగ్, రోబో వార్ లాంటి పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వహకులు తెలియజేశారు.
సీ ప్లేన్ను లాంఛనంగా ప్రారంభించిన సీఎం- దేశీయ పర్యాటకంలోనే ఇదో మైలురాయన్న చంద్రబాబు