ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు - వాసుదేవరెడ్డి డిప్యుటేషన్ పొడిగింపు - VASUDEVA REDDY DEPUTATION EXTENDED

ఐఆర్‌టీఎస్‌ అధికారి వాసుదేవరెడ్డి డిప్యుటేషన్ పొడిగింపు - మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డి

Vasudeva reddy
Vasudeva reddy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 5:35 PM IST

Liquor Case Accused Vasudeva Reddy Deputation Extended: మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు, ఐఆర్​టీఎస్ అధికారి డి.వాసుదేవరెడ్డి డిప్యుటేషన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో ఆయన డిప్యుటేషన్​ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మద్యం కేసు విచారణ జరుగుతున్నందున ఆయన్ని రాష్ట్రం నుంచి రిలీవ్ చేయకుండా, డిప్యుటేషన్​పై కొనసాగిస్తున్నారు.

మద్యం కుంభకోణంలో విచారణ నేపథ్యంలో: ఐఆర్​టీఎస్ అధికారిగా ఉన్న డి.వాసుదేవరెడ్డిపై జరుగుతున్న విచారణ దృష్ట్యా డిప్యుటేషన్​పై ఏపీలో కొనసాగించేందుకు అనుమతిస్తూ రైల్వే శాఖ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో 2024 ఆగస్టు 25 నుంచి వాసుదేవరెడ్డి డిప్యుటేషన్​ను ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈమేరకు సీఎస్ కె.విజయానంద్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసులో సీఐడీ విచారణను ముమ్మరం చేసింది.

మద్యం కుంభకోణం:కాగా వైఎస్సార్సీపీ హయాంలో మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హాలోగ్రామ్‌ల తయారీ, సరఫరా టెండర్‌ అప్పగింత కుంభకోణంలో ఏపీఎస్‌బీసీఎల్‌ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డి పాత్రపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఆయన బెయిల్​ పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇటీవల జరిగిన విచారణలో వాసుదేవరెడ్డి పాత్రపై మరిన్ని ఆధారాలు లభించాయని, పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని సీఐడీ తరఫున పీపీ ఎం.లక్ష్మీనారాయణ హైకోర్టుకు తెలిపారు. అర్హత లేని సంస్థలకు టెండర్‌లో పాల్గొనే అవకాశమిచ్చారని, ఇందుకోసం వాసుదేవరెడ్డికి భారీగా సొమ్ము ముట్టినట్లు పేర్కొన్నారు. వాస్తవాలను రాబట్టేందుకు కస్టోడీలోకి తీసుకుని విచారణ చేయాలని కోర్టుకు విన్నవించారు.

మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హాలోగ్రామ్‌ల తయారీ, సరఫరా విషయంలో వాసుదేవరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెన్నైకి చెందిన సీనియర్‌ పాత్రికేయుడు వి.శివరామన్‌ గతేడాది నవంబరు 23వ తేదీన ఫిర్యాదు చేశారు. తద్వారా కుంభత్‌ హాలోగ్రాఫిక్స్‌ సంస్థ, హోలిస్టిక్‌ ఇండియా, అల్ఫాలేజర్‌ టెక్‌ సంస్థలను టెండర్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు నాటి ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీ వాసుదేవరెడ్డి అవకాశమిచ్చారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వి.శివరామన్‌ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్​ కోసం వాసుదేవరెడ్డి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వెలుగుచూస్తున్న వాసుదేవరెడ్డి లిక్కర్ లీలలు - నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా! - Liquor Supply Fake Hologram Sticker

ఎక్సైజ్‌శాఖలో హాలోగ్రామ్స్‌ కుంభకోణం - గుర్తించిన విజిలెన్స్ కమిషన్ - Liquor Supply Fake Hologram Sticker

ABOUT THE AUTHOR

...view details