ETV Bharat / state

ఆలేరు రెవిన్యూ డివిజన్‌ కోసం సంతకాల సేకరణ

author img

By

Published : Oct 10, 2020, 5:35 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణాన్ని రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు.

Signatures collection for to make aleru as revenue division
ఆలేరు రెవిన్యూ డివిజన్‌ కోసం సంతకాల సేకరణ

రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరును రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించాలంటూ అఖిలపక్ష కమిటీ నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. డివిజన్‌ కోసం మూడేళ్లుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు తెలిపారు.

ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా స్పందించడం లేదని అఖిలపక్ష కమిటీ నాయకులు అన్నారు. స్థానిక ఎమ్మెల్యేనైనా స్పందించి రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షుడు వెంకటేష్, కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:సేవను సరిహద్దులు దాటించిన తెలుగు తేజాలు.!

రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరును రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించాలంటూ అఖిలపక్ష కమిటీ నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. డివిజన్‌ కోసం మూడేళ్లుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు తెలిపారు.

ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా స్పందించడం లేదని అఖిలపక్ష కమిటీ నాయకులు అన్నారు. స్థానిక ఎమ్మెల్యేనైనా స్పందించి రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షుడు వెంకటేష్, కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:సేవను సరిహద్దులు దాటించిన తెలుగు తేజాలు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.