రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి సిద్దిపేట జిల్లా అత్యంత చేరువలో ఉంటుంది. ఇక్కడి రైతులు ఎక్కువగా కూరగాయ తోటలు సాగు చేస్తుంటారు. ఉద్యాన శాఖ అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారు 15 వందల ఎకరాల్లో టమాటా, 7 వందల ఎకరాల్లో మిరప, 3 వందల ఎకరాల్లో వంగ, 5 వందల ఎకరాల్లో బెండ, 100 ఎకరాల్లో సొరకాయ సాగు చేస్తున్నారు. పండించిన కూరగాయలన్నీ హైదరాబాద్ నగరంలోని మార్కెట్లకు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు.
ఇతర రాష్ట్రాల నుంచి..
ప్రస్తుతం మార్కెట్లో వీటిని కొనడానికి వ్యాపారులెవరూ ముందుకు రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ల నుంచి ఎక్కువ మొత్తంలో కూరగాయలు హైదరాబాద్ నగరానికి ప్రతినిత్యం రావడమే.