ETV Bharat / state

ప్రజాబంధు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

author img

By

Published : Jul 21, 2020, 8:21 PM IST

ప్రజాబంధు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్​ కాగజ్​నగర్​ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మారుమాల ప్రాంతాల్లో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.

free medical camp in dinda village
free medical camp in dinda village

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు డా. పాల్వాయి హరీశ్​ బాబు నేతృత్వంలోని వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది.

120 మందికి రక్తపరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రి వైద్యులు డా. వరుణ్ కుమార్, డీసీసీ ఓబీసీ ఛైర్మన్ వెంకటేశ్​, సర్పంచ్ నానయ్య, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనా విలయం: కోటి 47 లక్షలు దాటిన కేసులు

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు డా. పాల్వాయి హరీశ్​ బాబు నేతృత్వంలోని వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది.

120 మందికి రక్తపరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రి వైద్యులు డా. వరుణ్ కుమార్, డీసీసీ ఓబీసీ ఛైర్మన్ వెంకటేశ్​, సర్పంచ్ నానయ్య, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనా విలయం: కోటి 47 లక్షలు దాటిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.