కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు డా. పాల్వాయి హరీశ్ బాబు నేతృత్వంలోని వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది.
ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మారుమాల ప్రాంతాల్లో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
![ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం free medical camp in dinda village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8116268-844-8116268-1595337329114.jpg?imwidth=3840)
120 మందికి రక్తపరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రి వైద్యులు డా. వరుణ్ కుమార్, డీసీసీ ఓబీసీ ఛైర్మన్ వెంకటేశ్, సర్పంచ్ నానయ్య, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా విలయం: కోటి 47 లక్షలు దాటిన కేసులు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు డా. పాల్వాయి హరీశ్ బాబు నేతృత్వంలోని వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది.
120 మందికి రక్తపరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రి వైద్యులు డా. వరుణ్ కుమార్, డీసీసీ ఓబీసీ ఛైర్మన్ వెంకటేశ్, సర్పంచ్ నానయ్య, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.