హైదరాబాద్లోని లంగర్హౌజ్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్నూకర్ పార్లర్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్న స్నూకర్ పార్లర్పై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు. దాడి చేసిన సమయంలో ఆటలో పాల్గొన్న 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2వేలు స్వాధీనం చేసుకొని లంగర్హౌజ్ పోలీసులకు అప్పగించారు. కరోనా సమయంలో కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ