ETV Bharat / state

స్నూకర్​ పార్లర్​పై పోలీసుల దాడి.. 25 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

నగరంలో కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్నూకర్​ పార్లర్​పై వెస్ట్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి స్నూకర్​ పార్లర్​ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసి స్నూకర్​ ఆడుతున్న 25 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Aug 25, 2020, 1:24 PM IST

Task Force  Police Attacks On Snooker Game pool in Languar house
స్నూకర్​ పార్లర్​పై పోలీసుల దాడి.. అదుపులో 25 మంది!

హైదరాబాద్​లోని లంగర్​హౌజ్​ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్నూకర్​ పార్లర్​పై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్న స్నూకర్​ పార్లర్​పై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు. దాడి చేసిన సమయంలో ఆటలో పాల్గొన్న 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2వేలు స్వాధీనం చేసుకొని లంగర్​హౌజ్​ పోలీసులకు అప్పగించారు. కరోనా సమయంలో కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

హైదరాబాద్​లోని లంగర్​హౌజ్​ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్నూకర్​ పార్లర్​పై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్న స్నూకర్​ పార్లర్​పై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు. దాడి చేసిన సమయంలో ఆటలో పాల్గొన్న 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2వేలు స్వాధీనం చేసుకొని లంగర్​హౌజ్​ పోలీసులకు అప్పగించారు. కరోనా సమయంలో కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్​దీప్​సింగ్​ పూరీతో భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.