ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలిఇన్నింగ్స్లో టీమ్ఇండియా ఆధిపత్యం కనపరుస్తోంది. రెండోరోజు ఆటపూర్తయ్యే సరికి 82 పరుగుల ఆధిక్యంలో దూసుకుపోయింది. అయితే.. బలమైన బ్యాట్స్మెన్ భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడం వల్లే.. ప్రత్యర్థులను ధాటిగా ఎదుర్కోగలగామని అన్నాడు టీమ్ఇండియా ఆటగాడు శుభ్మన్ గిల్. మ్యాచ్కు ముందే తాము ఈ అంశంపై చర్చించుకున్నామని తెలిపాడు.
"మ్యాచ్కు ముందే బ్యాట్స్మెన్ భాగస్వామ్యంపై మేమంతా చర్చించుకున్నాం. ఇన్నింగ్స్లో మా మొదటి వికెట్ కోల్పోయినప్పుడు.. సాధ్యమైనంత మేర మా భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నేను.. పుజారా అనుకున్నాం. ప్రస్తుతం రహానే, జడేజా మధ్య అద్భుతమైన భాగస్వామ్యం నడుస్తోంది. వాళ్లు దాన్ని 150 లేదా అంతకంటే ఎక్కువకే తీసుకు వెళ్లగలరని నేను అనుకుంటున్నాను."
--శుభ్మన్ గిల్, టీమ్ఇండియా ఆటగాడు.