కన్నడ నటుడు యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమా 'కేజీఎఫ్'. ఈ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కిస్తోంది చిత్రబృందం.
ఈ సీక్వెల్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ సెట్స్ సిద్ధం చేస్తున్నాడట. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం కోలార్ పరిసరాల్లో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. వీటి కోసం సుమారు మూడు వందల యాభైమంది ఏకధాటిగా పనిచేస్తున్నారట. హోంబలే ప్రొడక్షన్స్ సంస్థ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
ఇవీ చూడండి.. అర్జున్ రెడ్డికి, ఆదిత్య వర్మకు తేడా అదే!