తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా విసిరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్కం వెబ్సైట్లను హ్యాక్ చేశారు. ర్యాన్సమ్ వెర్ వైరస్తో రెచ్చిపోయారు. టీఎస్ఏస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీఎస్ఎల్ వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయి.
డేటా హ్యాక్ చేయడంతో పాటు డిలీట్ చేసి రూ.35 కోట్లు డిమాండ్ చేశారు అంతర్జాతీయ హ్యాకర్లు. డేటా బ్యాకప్ ఉండటంతో ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు. డిస్కంల హ్యాకింగ్పై సీసీఎస్ పోలీసులకు టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్ కింద హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.