ETV Bharat / jagte-raho

అడవి పంది కోసం వేసిన విద్యుత్​ తీగలు తగిలి తండ్రీ కొడుకు మృతి

author img

By

Published : Oct 16, 2020, 7:18 PM IST

అడవి పందుల దాడి నుంచి పంటను కాపాడేందుకు వేసిన విద్యుత్​ తీగలు తగిలి తండ్రీ కొడుకు బలైన ఘటన మెదక్​ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి తండాలో జరిగింది.

father and son died due to current shock at medak district
అడవి పంది కోసం వేసిన విద్యుత్​ తీగలు తగిలి తండ్రీ కొడుకు మృతి

మెదక్​ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి తండాలో దారుణం జరిగింది. అడవి పందుల కోసం రైతులు వేసిన విద్యుత్​ తీగలు తగిలి తండ్రీ కొడుకు మరణించారు. తీగల విషయం తెలియక అటుగా వెళ్లగా విద్యుత్​ తీగలు తగిలి కరెంట్​ షాక్​తో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ కృష్ణమూర్తి వివరించారు.

ఇదీ చదవండిః ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడిన తల్లి

మెదక్​ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి తండాలో దారుణం జరిగింది. అడవి పందుల కోసం రైతులు వేసిన విద్యుత్​ తీగలు తగిలి తండ్రీ కొడుకు మరణించారు. తీగల విషయం తెలియక అటుగా వెళ్లగా విద్యుత్​ తీగలు తగిలి కరెంట్​ షాక్​తో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ కృష్ణమూర్తి వివరించారు.

ఇదీ చదవండిః ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.