ఉగ్రవాదంపై వ్యతిరేక విన్యాసాలు చేపట్టాలని భారత్, చైనా, పాకిస్థాన్ సహా షాంఘై సహాకార కూటమి-ఎస్సీఓలోని 8 సభ్య దేశాలు నిర్ణయించాయి. ఈ ఏడాది సంయుక్త విన్యాసాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు మార్చి 18న ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరిగిన ఉగ్రవాద నిర్మూలన సమావేశంలో సభ్య దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.
2022-24 మధ్య ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదంపై పోరాడేందుకు సభ్య దేశాలు అనుసరించాల్సిన ప్రణాళికను ఎస్సీఓ విడుదల చేసింది. ఈమేరకు ముసాయిదాను ఆమోదించినట్లు తెలిపింది. ఉగ్రవాద సంస్థలకు ఊతం ఇస్తున్న ఆర్థిక మూలాలను అణచివేయాలని తీర్మానించింది.
ఎస్సీఓలో భారత్తో పాటు చైనా, రష్యా, కజకిస్థాన్,కిర్గిజ్ రిపబ్లిక్, పాకిస్థాన్,తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: 'ఉగ్రవాద నిర్మూలనతోనే ప్రగతివైపు అడుగులు'