అడవి తల్లి తన ఒడిలో ఎన్నో అరుదైన ఖనిజాలు దాచుకుంది. వాటిలో రుగ్డా, కుక్డీ పుట్టగొడుగులు ఒకటి. తొలకరి జల్లులు కురవగానే ఝార్ఖండ్ సుఖవా వనాల్లో విరివిగా విరబూస్తాయీ అరుదైన పుట్టగొడుగులు. సంపూర్ణ పోషకాలు కలిగిన ఈ రుగ్డా, కుక్డీల రుచికి ఏదీ సాటిలేదు. అచ్చం మేక మాంసం రుచిని తలపించే ఈ పుట్టగొడుగులు 'శాకాహారుల మటన్'గా పేరుగాంచాయి.
మటన్తో సమానం..
చిన్న బంగాళదుంపల్లా కనిపించే ఈ రుగ్డా, కుక్డీలు తెలుపు, నలుపు రంగుల్లో దొరుకుతాయి. వానాకాలంలో మాత్రమే పండే ఈ పుట్టగొడుగులను గిరిజనులు సేకరించి రాజధాని రాంచీ సహా ఇతర నగరాల్లో వ్యాపారులకు విక్రయిస్తారు. మటన్ రుచిని కలిగి ఉండడమే కాదు, మటన్తో సమానంగా దాదాపు కిలో రూ.400 నుంచి రూ.500లు ధర పలుకుతాయి.
"వర్షాకాలంలో అడవిలో పూస్తాయి ఈ పుట్టగొడుగులు. మేఘాలు ఉరిమినప్పుడు ఈ రుగ్డాలు మొలకెత్తుతాయి. పుట్టగొడుగులు తవ్వి తెచ్చిన వారి వద్ద కిలో రూ.350కి కొంటాం. మట్టిని అంతా శుద్ధి చేసి, రూ.400 కిలో చొప్పున విక్రయిస్తాం. ఇవి ఝార్ఖండ్ వాసులకు ఎంతో ఇష్టం"
-రుగ్డా విక్రేత, రాంచి