ETV Bharat / bharat

ఇది కరోనా కాలం.. బాధ్యత ఉండక్కర్లేదా?

author img

By

Published : Mar 21, 2020, 1:34 PM IST

కరోనా వైరస్ దేశంలో క్రమంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో నియంత్రణ దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. దేశంలోనే వైరస్ కేసుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్రలో కూడా సెలవులు ఇచ్చారు. అయితే వైరస్​ వ్యాప్తి నిరోధానికి ఇంట్లో ఉండటానికి బదులుగా ముంబయి పౌరులు క్రికెట్, వాకింగ్​ల పేరుతో బయటతిరుగుతూ ప్రమాదం మరింత పెరిగేలా వ్యవహరిస్తున్నారు. ముంబయి వాసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

mumbai
ముంబై

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటికే 270కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవులు ప్రకటించి మహమ్మారి మరింతమందికి అంటుకోకుండా చర్యలు చేపడుతున్నాయి. దేశంలోనే అత్యంత ఎక్కువగా మహారాష్ట్రలో 63 కేసులు నమోదైన నేపథ్యంలో అక్కడకూడా సెలవులు ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అయితే వైరస్​పై జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో ఉండాల్సింది పోయి.. యథేచ్చగా సంచరిస్తున్నారు అక్కడి పౌరులు. క్రికెట్ మ్యాచులు, వాకింగ్​లతో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశాలను పెంచుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో అత్యంత ముఖ్యమైనది ఇతరులతో అవసరమైన మేరకు దూరంగా ఉండటం. ఈ అంశాన్ని విస్మరించకూడదని వైద్యులు పదేపదే సూచిస్తున్నారు. అన్ని వైరస్​ల మాదిరిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదని ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తేనే వైరస్ వ్యాప్తిని అరికట్టగలమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు వైరస్ తీవ్రతను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

ముంబై వాసుల నిర్లక్ష్య వైఖరి

ఇదీ చూడండి: బ్రెడ్​ వ్యాపారి సైకిల్​పై మోదీ 'జనతా' స్వరం!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటికే 270కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవులు ప్రకటించి మహమ్మారి మరింతమందికి అంటుకోకుండా చర్యలు చేపడుతున్నాయి. దేశంలోనే అత్యంత ఎక్కువగా మహారాష్ట్రలో 63 కేసులు నమోదైన నేపథ్యంలో అక్కడకూడా సెలవులు ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అయితే వైరస్​పై జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో ఉండాల్సింది పోయి.. యథేచ్చగా సంచరిస్తున్నారు అక్కడి పౌరులు. క్రికెట్ మ్యాచులు, వాకింగ్​లతో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశాలను పెంచుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో అత్యంత ముఖ్యమైనది ఇతరులతో అవసరమైన మేరకు దూరంగా ఉండటం. ఈ అంశాన్ని విస్మరించకూడదని వైద్యులు పదేపదే సూచిస్తున్నారు. అన్ని వైరస్​ల మాదిరిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదని ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తేనే వైరస్ వ్యాప్తిని అరికట్టగలమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు వైరస్ తీవ్రతను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

ముంబై వాసుల నిర్లక్ష్య వైఖరి

ఇదీ చూడండి: బ్రెడ్​ వ్యాపారి సైకిల్​పై మోదీ 'జనతా' స్వరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.