భారత్-ఆసియాన్ దేశాల మధ్య అన్ని విధాలుగా అనుసంధానతను పెంచడమే తమ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ ప్రాంతంలో భద్రత, అభివృద్ధిని మెరుగుపరిచేందుకు బాధ్యతాయుతమైన ఆసియాన్ అవసరం ఉందన్నారు. 17వ ఆసియాన్ సదస్సులో వర్చువల్గా పాల్గొన్న ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల భారత దేశ ఆలోచనలు, ఆ ప్రాంతంపై ఆసియాన్ దృక్పథం ఒకే విధంగా ఉందని పేర్కొన్నారు ప్రధాని. తొలినాళ్ల నుంచే భారత "యాక్ట్ ఈస్ట్ పాలసీ"లో ఆసియాన్ బృందం కీలక పాత్ర పోషించిందన్నారు.