మధ్యప్రదేశ్లో కరోనా సోకిన ఓ పాత్రికేయుడు మార్చి 20న అప్పటి ముఖ్యమంత్రి కమల్నాథ్ మీడియా సమావేశానికి హాజరైనందు వల్ల ఆయనపై కేసు నమోదు చేశారు. ఇటీవల లండన్లో న్యాయశాస్త్రం చదువుతున్న జర్నలిస్ట్ కుమార్తె భారత్కు వచ్చింది. ఈ క్రమంలోనే గృహ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం సూచించినప్పటికీ వినకుండా మీడియా సమావేశానికి హాజరయ్యారు ఆ జర్నలిస్ట్. ఈ కార్యక్రమం జరిగిన కొన్ని రోజుల తర్వాత పాత్రికేయుడితో పాటు ఆయన కుమార్తెకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది.
ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్పై భోపాల్ శ్యామ్లా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 188(ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘన), 269(ప్రాణాంతక వ్యాధిని నిర్లక్ష్యం చేయడం), 270ల కింద కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా.. ప్రభుత్వం ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు.