కడప జిల్లా నందలూరు మండలం ఇసుకపల్లిలో ఏడు తరాలకు సంబంధించిన 32 సెంట్ల స్థలాన్ని స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో కొందరు కబ్జా చేశారని బాధితురాలు రేణుక ఎల్లమ్మ ఆరోపించారు. ఆ భూమిలో ప్రహరీ నిర్మించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి సంబంధించి తమ వద్ద అసలైన పత్రాలు ఉన్నాయని.., నకిలీ పత్రాలు చూపించి ఆ స్థలాన్ని కబ్జా చేశారని అన్నారు. స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకుల సహకారంతో కబ్జాకు పాల్పడ్డారని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆమె తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డీయే తమను కాపాడాలని ఆమె వేడుకున్నారు.
ఇదీ చదవండి: 'తమ అనుచరులు, కార్యకర్తల జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి'