ETV Bharat / state

ఊరు పొమ్మంది... ప్రభుత్వం వద్దంది - జమ్మలమడుగు తాజా కొవిడ్​ వార్తలు

వారంతా ఉత్తరప్రదేశ్​కు చెందిన వలస కార్మికులు. లాక్​డౌన్​ కారణంగా సొంత రాష్ట్రాలకు వెళ్లలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రభుత్వ సాయం కోసం వేచి చూస్తున్నారు. ఇక ఇంటికి వెళ్లొచ్చన్న విషయం మండల తహసీల్దార్​ ఫోన్​ చేసి చెప్పడం వల్ల వారి ఆనందానికి అవధులు లేవు. కష్టాలు తీరాయి అనుకున్నారు. యజమానులకు ఇళ్లు ఖాళీ చేసి తాళాలు అందించారు. మధ్యాహ్నానికి జమ్మలమడుగు మండల కార్యలయం వద్దకు చేరుకున్నారు. వైద్య సిబ్బంది వారికి పరీక్షలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు కదిలాయి. కాని ఓ చేదు వార్త వల్ల ఆ ప్రయాణం ఆగిపోయింది.

uttarpradesh people in sadness as their government hadn't given permission to migrants in ap
నిరాశతో జమ్మలమడుగులో ఉండిపోయిన ఉత్తరప్రదేశ్​ వలస కూలీలు
author img

By

Published : May 14, 2020, 11:06 AM IST

కడప జిల్లా జమ్మలమడుగులో కొన్నేళ్లుగా ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వలస కూలీలు ఆశ్రయం పొందుతున్నారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సొంత రాష్ట్రానికి పంపించేందుకు చర్యలు తీసుకుంది. బుధవారం సాయంత్రం మొత్తం 112 కుటుంబాలకు చెందిన సభ్యులకు రెవెన్యూ అధికారులు ఫోన్ల ద్వారా సమాచారం అందించారు. కడప నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రాత్రి రైలు బయలు దేరుతుందని కాబట్టి... అందరూ ఎమ్మార్వో ఆఫీస్​కు చేరుకోవాలని అధికారులు చెప్పారు.

ఆ సమాచారం అందుకున్న యూపీ వాసులు సంబరపడ్డారు. మధ్యాహ్నం నుంచి వారంతా ఇల్లు ఖాళీ చేసి యజమానులకు తాళాలు ఇచ్చేశారు. సామాన్లతో వీరంతా జమ్మలమడుగు తాహసీల్దార్​ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ లోగా వైద్యులు, వైద్య సిబ్బంది వచ్చి ఉష్ణోగ్రత పరీక్షలు సైతం చేశారు. బస్టాండ్ నుంచి ఆర్టిసీ బస్సులు కదిలాయి. ఇంతలోనే తహసీల్దారుకు పిడుగులాంటి వార్త వచ్చింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ ప్రాంత వాసులను తరలించే విషయంపై... ఏపీ ప్రభుత్వానికి అనుమతులు ఇవ్వలేదని ఆయన సమాచారం అందింది.

రెవెన్యూ అధికారులు చేసేదిలేక ఈ విషయాన్ని వలసకూలీలకు చెప్పారు. ఇల్లు ఖాళీ చేసి యజమానులకు తాళాలు ఇచ్చి వచ్చేశాం... మళ్ళీ వెనక్కి వెళ్తే మా పరిస్థితేంటి అంటూ వారు ప్రశ్నించారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి సమాచారం రాగానే మళ్లీ ఫోన్ చేసి చెప్తామని సర్దిచెప్పడం వల్ల ప్రజలు నిరాశగా వెనుదిరిగారు.

కడప జిల్లా జమ్మలమడుగులో కొన్నేళ్లుగా ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వలస కూలీలు ఆశ్రయం పొందుతున్నారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సొంత రాష్ట్రానికి పంపించేందుకు చర్యలు తీసుకుంది. బుధవారం సాయంత్రం మొత్తం 112 కుటుంబాలకు చెందిన సభ్యులకు రెవెన్యూ అధికారులు ఫోన్ల ద్వారా సమాచారం అందించారు. కడప నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రాత్రి రైలు బయలు దేరుతుందని కాబట్టి... అందరూ ఎమ్మార్వో ఆఫీస్​కు చేరుకోవాలని అధికారులు చెప్పారు.

ఆ సమాచారం అందుకున్న యూపీ వాసులు సంబరపడ్డారు. మధ్యాహ్నం నుంచి వారంతా ఇల్లు ఖాళీ చేసి యజమానులకు తాళాలు ఇచ్చేశారు. సామాన్లతో వీరంతా జమ్మలమడుగు తాహసీల్దార్​ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ లోగా వైద్యులు, వైద్య సిబ్బంది వచ్చి ఉష్ణోగ్రత పరీక్షలు సైతం చేశారు. బస్టాండ్ నుంచి ఆర్టిసీ బస్సులు కదిలాయి. ఇంతలోనే తహసీల్దారుకు పిడుగులాంటి వార్త వచ్చింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ ప్రాంత వాసులను తరలించే విషయంపై... ఏపీ ప్రభుత్వానికి అనుమతులు ఇవ్వలేదని ఆయన సమాచారం అందింది.

రెవెన్యూ అధికారులు చేసేదిలేక ఈ విషయాన్ని వలసకూలీలకు చెప్పారు. ఇల్లు ఖాళీ చేసి యజమానులకు తాళాలు ఇచ్చి వచ్చేశాం... మళ్ళీ వెనక్కి వెళ్తే మా పరిస్థితేంటి అంటూ వారు ప్రశ్నించారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి సమాచారం రాగానే మళ్లీ ఫోన్ చేసి చెప్తామని సర్దిచెప్పడం వల్ల ప్రజలు నిరాశగా వెనుదిరిగారు.

ఇదీ చదవండి:

'నీళ్లు తాగి బతుకుతున్నాం.. మమ్మల్ని పంపేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.