కడప జిల్లా మైలవరం జలాశయం వద్ద ఆనకట్ట పై నుంచి ఉన్న రోడ్డు మార్గం భయంకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడలు అనేకచోట్ల శిథిలమయ్యాయి. విద్యుత్ సరఫరా లేని స్తంభాలు ఆనకట్ట పొడవునా దర్శనమిస్తున్నాయి. కట్టపైన రోడ్డు లేక పర్యాటకులు నానా అవస్థలు పడుతున్నారు. రక్షణ గోడలు సంబంధించిన రాళ్లు బయటపడడంతో పరిస్థితి దయనీయంగా మారింది. గండికోట జలాశయం నుంచి కృష్ణా జలాలు చేరడంతో మైలవరం డాం నిండుకుండలా మారింది. ప్రస్తుతం 6 టీఎంసీల చేరువులో ఉంది. సుమారు 75 వేల ఎకరాలకు సాగునీరు అందించే జలాశయం దుస్థితి అంతా ఇంతా కాదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి డ్యామ్ అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి