ఇవీ చదవండి:
దిల్లీ అల్లర్లకు వ్యతిరేకంగా రైల్వే కోడూరులో ముస్లింల వినూత్న నిరసన
కడప జిల్లా రైల్వే కోడూరులో సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా ముస్లింలు గత 17 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నారు. నేటి సాయంత్రం దిల్లీలో జరిగిన అల్లర్లకు నిరసనగా ముస్లిం మహిళలు, వామపక్ష పార్టీ నాయకులు చేతులకు తలకు గాయాలు తగిలినట్లు కట్లు కట్టుకుని గాంధీ విగ్రహం వరకూ ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. అనంతరం గాంధీ మహాత్మునికి వినతిపత్రం సమర్పించారు. అమిత్షా, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైల్వే కోడూరులో ముస్లింల విన్నూత్న నిరసనలు