ETV Bharat / state

బ్రహ్మంగారి మఠం పోలేరమ్మ ఆలయ సమీపంలో హత్య - కడప జిల్లా తాాాజా వార్తలు

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పోలేరమ్మ ఆలయ సమీపంలో దారుణం జరిగింది. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం మాలెపాడు గ్రామానికి చెందిన కొత్తూరు నాగరాజు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతను కారును అద్దెకు తీసుకుని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాణిపాకం నుంచి బ్రహ్మంగారి మఠానికి వచ్చినట్లుగా.. పోలీసులు భావిస్తున్నారు. నాగరాజును ఎవరు హత్య చేశారు, ఘటనకు దారితీసిన పరిస్థితులేంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

murder at bramham gari matam in kadapa
బ్రహ్మంగారి మఠం పోలేరమ్మ ఆలయ సమీపంలో హత్య
author img

By

Published : Mar 30, 2021, 10:34 AM IST

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పోలేరమ్మ ఆలయ సమీపంలో దారుణం జరిగింది. ఎర్రగుంట్ల మండలం మాలెపాడు గ్రామానికి చెందిన కొత్తూరు నాగరాజు(35)హత్యకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లుగా సమాచారం. సంఘటనా స్థలం వద్ద కారు ఉంది. అందులో లభించిన డైరీ ఆధారంగా నాగరాజు అద్దెకు కారు నడుపుతున్నట్లు తెలుస్తోంది. 29వ తేదీన కాణిపాకం, 30న బ్రహ్మంగారిమఠం అని డైరీలో రాసుకోవడంతో.. కాణిపాకం నుంచి బ్రహ్మంగారి మఠానికి వచ్చినట్లుగా భావిస్తున్నారు. కారులో ఎవరు ప్రయాణించారు, హత్యకు దారితీసిన పరిస్థితులేంటి అనే దిశగా పోలీసులు విచారణ ప్రారంభించారు.

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పోలేరమ్మ ఆలయ సమీపంలో దారుణం జరిగింది. ఎర్రగుంట్ల మండలం మాలెపాడు గ్రామానికి చెందిన కొత్తూరు నాగరాజు(35)హత్యకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లుగా సమాచారం. సంఘటనా స్థలం వద్ద కారు ఉంది. అందులో లభించిన డైరీ ఆధారంగా నాగరాజు అద్దెకు కారు నడుపుతున్నట్లు తెలుస్తోంది. 29వ తేదీన కాణిపాకం, 30న బ్రహ్మంగారిమఠం అని డైరీలో రాసుకోవడంతో.. కాణిపాకం నుంచి బ్రహ్మంగారి మఠానికి వచ్చినట్లుగా భావిస్తున్నారు. కారులో ఎవరు ప్రయాణించారు, హత్యకు దారితీసిన పరిస్థితులేంటి అనే దిశగా పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇదీ చదవండి: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. తండ్రి, కుమార్తె మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.