రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ యశ్వంత్ కుమార్ పోలీసు లాంఛనాలతో అంతక్రియలు జరిపారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ కమలాపురం మండలం గంగవరంలో యశ్వంత్ కుమార్ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఆయన అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసు లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించారు. యశ్వంత్ కుమార్ ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరమని సీఐ ఉలసయ్య అన్నారు. ప్రభుత్వం తరపు నుంచి యశ్వంత్ కుటుంబానికి అందవలసిన ప్రతిది సకాలంలో అందజేస్తామని తెలిపారు.
ఇవీ చూడండి..