కడప జిల్లా చాపాడు మండలం కేతవరం వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో యజమాని మృతి చెందాడు. రామశేఖర్(49) అనే వ్యక్తి ప్రొద్దుటూరు నుంచి కాజీపేటకు కారులో వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు యజమాని అక్కడిక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.