ETV Bharat / state

ప్రమాదం కాదు.. వేధింపులు తట్టుకోలేక ప్రాణం తీసుకున్నాడు - తణుకులో వృద్ధుడు ఆత్మహత్య

84 ఏళ్ల వృద్ధుడు.. వారి వేధింపులు తట్టుకోలేకపోయారు. తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారనే మనస్తాపంతో అపార్టుమెంటుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెుదట ప్రమాదవశాత్తూ పడిపోయారేమో అనుకున్న పోలీసులకు... వృద్ధుడు రాసిన సూసైడ్ లేఖ బయటపడటంతో.. అసలు విషయం బయటపడింది.

old man suicide
వేధింపులు తట్టుకోలేక వృద్ధుడు ఆత్మహత్య
author img

By

Published : Jul 17, 2020, 6:56 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల క్రితం అపార్టుమెంట్ మీద నుంచి పడి మృతి చెందిన వృద్ధుడు కేసు మరో మలుపు తిరిగింది. మెుదట అందరూ ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోయి ఉండవచ్చునని అనుకున్నారు. కానీ... అతని ఇంట్లో దొరికిన సూసైడ్ నోట్ ద్వారా అతడు వేధింపులు తట్టుకోలేక ప్రాణం తీసుకున్నాడనే విషయం బయటపడింది.

అసలేం జరిగింది

కోరుకొండ లక్ష్మీపతిరావు జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసి రిటైర్ అయిన ఆయన.. సొంత స్థలంలో జయలక్ష్మీ రెసిడెన్సీను నిర్మించారు. అందులో ఒక ఫ్లాట్​ మినహా అన్నింటినీ అమ్మేశారు. ఒక ఫ్లాట్​ను అద్దెకిస్తున్నారు. వయోభారంతో అపార్టుమెంటు నిర్వహణ బాధ్యతలు కమిటీకి అప్పగించేశారు.

కమిటీ సభ్యులైన వంక లక్ష్మికుమారి, శేషులు తనని వేధింపులకు గురి చేయటంతో పాటు.. తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని సూసైడ్ లేఖలో రాశారు. అపార్టుమెంటు కాపలాదారుడితో కుమ్మక్కై తీవ్రంగా వేధించారని లక్ష్మీపతిరావు లేఖలో పేర్కొన్నారు. తన ఫ్లాట్​లోకి ఎవ్వరినీ అద్దెకు రానివ్వటం లేదనీ... వచ్చిన వారిని ఉండనివ్వటం లేదని లేఖలో రాశారు. వారి వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖలో వివరించారు.

84 ఏళ్ల వృద్ధుడు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవటం అందరి కంట కన్నీరు పెట్టిస్తుంది. తన భర్త మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడు భార్య జయలక్ష్మి వేడుకుంటుంది.

ఇదీ చదవండి: కరోనా పాజిటీవ్​ అనుకుని.. ఆందోళనతో వృద్ధుడు మృతి..

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల క్రితం అపార్టుమెంట్ మీద నుంచి పడి మృతి చెందిన వృద్ధుడు కేసు మరో మలుపు తిరిగింది. మెుదట అందరూ ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోయి ఉండవచ్చునని అనుకున్నారు. కానీ... అతని ఇంట్లో దొరికిన సూసైడ్ నోట్ ద్వారా అతడు వేధింపులు తట్టుకోలేక ప్రాణం తీసుకున్నాడనే విషయం బయటపడింది.

అసలేం జరిగింది

కోరుకొండ లక్ష్మీపతిరావు జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసి రిటైర్ అయిన ఆయన.. సొంత స్థలంలో జయలక్ష్మీ రెసిడెన్సీను నిర్మించారు. అందులో ఒక ఫ్లాట్​ మినహా అన్నింటినీ అమ్మేశారు. ఒక ఫ్లాట్​ను అద్దెకిస్తున్నారు. వయోభారంతో అపార్టుమెంటు నిర్వహణ బాధ్యతలు కమిటీకి అప్పగించేశారు.

కమిటీ సభ్యులైన వంక లక్ష్మికుమారి, శేషులు తనని వేధింపులకు గురి చేయటంతో పాటు.. తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని సూసైడ్ లేఖలో రాశారు. అపార్టుమెంటు కాపలాదారుడితో కుమ్మక్కై తీవ్రంగా వేధించారని లక్ష్మీపతిరావు లేఖలో పేర్కొన్నారు. తన ఫ్లాట్​లోకి ఎవ్వరినీ అద్దెకు రానివ్వటం లేదనీ... వచ్చిన వారిని ఉండనివ్వటం లేదని లేఖలో రాశారు. వారి వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖలో వివరించారు.

84 ఏళ్ల వృద్ధుడు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవటం అందరి కంట కన్నీరు పెట్టిస్తుంది. తన భర్త మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడు భార్య జయలక్ష్మి వేడుకుంటుంది.

ఇదీ చదవండి: కరోనా పాజిటీవ్​ అనుకుని.. ఆందోళనతో వృద్ధుడు మృతి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.