ETV Bharat / state

'లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చేవరకు పోరాటం ఆపేది లేదు' - Titco houses

నిరుపేదలకు టిడ్కో గృహలు అందించాలని తెదేపా శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టాయి. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని నరసాపురం, పాలకొల్లు, ఏలూరు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో లబ్ధిదారులతో కలిసి నేతలు ఆందోళన నిర్వహించారు.

"నా ఇల్లు నా సొంతం" పేరిట తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
"నా ఇల్లు నా సొంతం" పేరిట తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
author img

By

Published : Nov 6, 2020, 3:40 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో నిరుపేదలకు టిడ్కో గృహలు అందించాలని "నా ఇల్లు నా సొంతం" పేరుతో తెదేపా శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. టిడ్కో గృహాలు ఉన్న నరసాపురం, పాలకొల్లు, ఏలూరు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి.

గృహాల వరకు పాదయాత్ర..

కార్యక్రమంలో భాగంగా టిడ్కో గృహాల వరకు పాదయాత్ర నిర్వహించారు. ఏలూరులో తెదేపా నియోజకవర్గ బాధ్యులు బడేటి రాధాకృష్ణ.. లబ్ధిదారులతో కలసి టిడ్కో గృహాలను పరిశీలించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తి చేసిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించే వరకు ఉద్యమం చేపడతామని రాధాకృష్ణ చెప్పారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో నిరుపేదలకు టిడ్కో గృహలు అందించాలని "నా ఇల్లు నా సొంతం" పేరుతో తెదేపా శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. టిడ్కో గృహాలు ఉన్న నరసాపురం, పాలకొల్లు, ఏలూరు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి.

గృహాల వరకు పాదయాత్ర..

కార్యక్రమంలో భాగంగా టిడ్కో గృహాల వరకు పాదయాత్ర నిర్వహించారు. ఏలూరులో తెదేపా నియోజకవర్గ బాధ్యులు బడేటి రాధాకృష్ణ.. లబ్ధిదారులతో కలసి టిడ్కో గృహాలను పరిశీలించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తి చేసిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించే వరకు ఉద్యమం చేపడతామని రాధాకృష్ణ చెప్పారు.

ఇవీ చూడండి:

ప్రైవేటు సంస్థల చేతికి ఇసుక రీచ్​లు.. అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.