విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మాత్రమే ప్రవేశం కల్పించారు. మిగిలిన వారెవరికీ అనుమతివ్వలేదు.
అయితే.. ఓ గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన సర్పంచ్.. కొంత మంది గిరిజనులతో కలిసి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ.. జాబితా ప్రకారమే అధికారులు ప్రజాప్రతినిధులను లోనికి పంపిస్తామని పోలీసులు తెలపడంతో.. గిరిజన ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.