పురపాలక సంఘాల్లో ఆస్తి పన్నును పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజయనగరంలో సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. కోట జంక్షన్ వద్ద సంబంధిత జీవో కాపీలను చించి నిరసన తెలిపారు. ఇప్పటికే ప్రజలు ఇబ్బందు పడుతున్నారని, ఆస్తి పన్ను పెంచడం మరింత భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: