ETV Bharat / state

విజయనగరంలో సీపీఎం వంద ఏళ్ల ఉత్సవం - CPM centenary celebrations in Vijayanagarm

భారత కమ్యూనిస్ట్​ పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తైన సందర్భంగా విజయనగరంలోని ఎల్​.బి.జీ భవన్ వద్ద సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ జెండాను ఆవిష్కరించారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల కోసం నిరంతరం పోరాడుతుందని ఆయన అన్నారు.

విజయనగరంలో సీపీఎం వంద ఏళ్ల ఉత్సవం
విజయనగరంలో సీపీఎం వంద ఏళ్ల ఉత్సవం
author img

By

Published : Oct 17, 2020, 1:36 PM IST

భారత కమ్యునిస్ట్ పార్టీ ఏర్పడి 100 ఏళ్ళు పూర్తైన సందర్భంగా విజయనగరంలోని ఎల్.బి.జి భవన్ వద్ద సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ జెండా ఆవిష్కరించారు. అనంతరం భారత కమ్యునిస్ట్ పార్టీ 100 సంవత్సరాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ.... కమ్యూనిస్టు పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల కోసమే నిరంతరం పోరాడుతుందని అన్నారు. కమ్యూనిస్టులు త్యాగ నిరతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. దళితులపై వివక్షతకి వ్యతిరేకంగా, గిరిజనులకు అండగా 1/70 చట్టం సాధించింది కమ్యూనిస్టులేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రెడ్డి శంకర్రావు, టీవీ రమణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

భారత కమ్యునిస్ట్ పార్టీ ఏర్పడి 100 ఏళ్ళు పూర్తైన సందర్భంగా విజయనగరంలోని ఎల్.బి.జి భవన్ వద్ద సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ జెండా ఆవిష్కరించారు. అనంతరం భారత కమ్యునిస్ట్ పార్టీ 100 సంవత్సరాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ.... కమ్యూనిస్టు పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల కోసమే నిరంతరం పోరాడుతుందని అన్నారు. కమ్యూనిస్టులు త్యాగ నిరతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. దళితులపై వివక్షతకి వ్యతిరేకంగా, గిరిజనులకు అండగా 1/70 చట్టం సాధించింది కమ్యూనిస్టులేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రెడ్డి శంకర్రావు, టీవీ రమణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

నిత్యావసరమే.. అత్యవసరంగా పొదుపుచేయాల్సిందే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.