ఈ కేసు దర్యాప్తు సంబంధించి నిందితుడు నరేంద్ర కుమార్ ప్రతి ఆదివారం ఆరిలోవ స్టేషన్లో సంతకం చేయాలని, కేసు దర్యాప్తులో సహకరించాలని కోర్టు తెలిపింది.
ఏప్రిల్ 13న రుషికొండ బీచ్లో కొంతమంది వ్యక్తులు రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో నిషేధిత మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. కేసును విచారణ జరుపుతున్న ఆరిలోవ పోలీసులు నిందితుడు నరేంద్ర వాగ్మూలం నమోదు చేసి, విడుదల చేశారు.
నరేంద్ర వాగ్మూలం ఈ కేసులో కీలక ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు. మాదకద్రవ్యాలు నగరానికి ఎలా వచ్చాయి. ఎవరెవరు వినియోగించారన్న కోణంలో విచారణ జరుగుతున్నట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి : ఎన్నికల తర్వాత జాతీయ టైగర్గా మమతా: చంద్రబాబు