ETV Bharat / state

ఇళ్ల పట్టాల పంపిణీలో ఏర్పాటు చేసిన శిలాఫలకం ధ్వంసం

author img

By

Published : Jan 4, 2021, 11:44 AM IST

విశాఖపట్నం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

plaque Vandalized
శాలాఫలకం ధ్వంసం

ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలోని పాయకరావుపేట మండలం ఎస్. నర్సాపురం గ్రామంలో జరిగింది. ఈ ఫలకాన్ని స్థానిక ఎమ్మెల్యే బాబూరావు శనివారం ప్రారంభించారు. ఫలకం ధ్వంసం విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు గ్రామంలోకి వెళ్లి ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలోని పాయకరావుపేట మండలం ఎస్. నర్సాపురం గ్రామంలో జరిగింది. ఈ ఫలకాన్ని స్థానిక ఎమ్మెల్యే బాబూరావు శనివారం ప్రారంభించారు. ఫలకం ధ్వంసం విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు గ్రామంలోకి వెళ్లి ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఇక విగ్రహాలు ధ్వంసం చేస్తే 10 ఏళ్ల జైలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.