ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలోని పాయకరావుపేట మండలం ఎస్. నర్సాపురం గ్రామంలో జరిగింది. ఈ ఫలకాన్ని స్థానిక ఎమ్మెల్యే బాబూరావు శనివారం ప్రారంభించారు. ఫలకం ధ్వంసం విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు గ్రామంలోకి వెళ్లి ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఇక విగ్రహాలు ధ్వంసం చేస్తే 10 ఏళ్ల జైలు