ETV Bharat / state

మాకు రావాల్సిన జీతం మాకివ్వాలి..!

author img

By

Published : Sep 24, 2019, 12:41 PM IST

విశాఖ ఏజెన్సీలో ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్న 250 మంది సిబ్బంది పాడేరు ఐటీడీఏను ముట్టడించారు. తమకు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మాకు రావాల్సిన జీతం మాకివ్వాలి!

మాకు రావాల్సిన జీతం మాకివ్వాలి!

విశాఖ ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య కార్యకర్తలు పాడేరు ఐటీడీఏలో నిరసన వ్యక్తం చేశారు. జీవో ప్రకారం తమకు 17 వేల రూపాయలు జీతం రావాలని.. ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి పూర్తి స్తాయి జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50 రోజులుగా పాడేరు ఐటీడీఏలో దీక్ష చేస్తున్నా.. స్పందన కొరవడిందని తెలిపారు. చేసేదేమీ లేక కార్యాలయం లోపలకు వెళ్లి బైఠాయించారు. స్పందించిన ఐటీడీఏ పీఓ బాలాజీ, డి.డి విజయ్ కుమార్ ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లామని... సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

మాకు రావాల్సిన జీతం మాకివ్వాలి!

విశాఖ ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య కార్యకర్తలు పాడేరు ఐటీడీఏలో నిరసన వ్యక్తం చేశారు. జీవో ప్రకారం తమకు 17 వేల రూపాయలు జీతం రావాలని.. ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి పూర్తి స్తాయి జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50 రోజులుగా పాడేరు ఐటీడీఏలో దీక్ష చేస్తున్నా.. స్పందన కొరవడిందని తెలిపారు. చేసేదేమీ లేక కార్యాలయం లోపలకు వెళ్లి బైఠాయించారు. స్పందించిన ఐటీడీఏ పీఓ బాలాజీ, డి.డి విజయ్ కుమార్ ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లామని... సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.