ETV Bharat / state

క్వారీలో బాంబు పేలుడు ధాటికి వ్యక్తి మృతి - ప్రకాశం జిల్లా నేర వార్తలు

ప్రకాశం జిల్లా కొండాయపాలెం సమీపంలోని క్వారీలో.. బాంబు పేలుళ్ల ధాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

క్వారీలో బాంబు పేలుడు దాటికి వ్యక్తి మృతి
క్వారీలో బాంబు పేలుడు దాటికి వ్యక్తి మృతి
author img

By

Published : Jan 25, 2021, 10:16 AM IST

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొండాయపాలెం సమీపంలోని గ్రానైట్ క్వారీలో చేపట్టిన పేలుళ్లు.... ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఎస్సై శివనాంచారయ్య తెలిపిన సమాచారం మేరకు.. తమిళనాడుకు చెందిన మునుస్వామి ఆర్ముగం(47).. కొండాయపాలెం సమీపంలోని గ్రానైట్ క్వారీలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆయన పని చేసే క్వారీ సమీపంలో నిమరో క్వారీలో పేలుళ్లు సంభవించాయి.

ఈ ధాటికి ఓ గ్రానైట్ రాయి ఎగిరి వచ్చి మునుస్వామి తలపై పడింది. ఆయన ఘటన స్థలంలోనే కుప్పకూలి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలనుఅడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొండాయపాలెం సమీపంలోని గ్రానైట్ క్వారీలో చేపట్టిన పేలుళ్లు.... ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఎస్సై శివనాంచారయ్య తెలిపిన సమాచారం మేరకు.. తమిళనాడుకు చెందిన మునుస్వామి ఆర్ముగం(47).. కొండాయపాలెం సమీపంలోని గ్రానైట్ క్వారీలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆయన పని చేసే క్వారీ సమీపంలో నిమరో క్వారీలో పేలుళ్లు సంభవించాయి.

ఈ ధాటికి ఓ గ్రానైట్ రాయి ఎగిరి వచ్చి మునుస్వామి తలపై పడింది. ఆయన ఘటన స్థలంలోనే కుప్పకూలి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలనుఅడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

ఉద్యోగ నియామకాల్లో ప్రిలిమ్స్ తొలగించే యోచనలో ఏపీపీఎస్సీ..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.