ETV Bharat / state

రూ.4 లక్షల విలువైన అరటి పంట దగ్ధం

author img

By

Published : Jun 8, 2020, 2:05 PM IST

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని మేడిపి గ్రామంలో ఆదివారం అరటి తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల విలువైన అరటి పంట దగ్ధమైంది.

fire accident in banana crop at prakasam
అరటి పంటలో అగ్నిప్రమాదం

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మండలంలోని మేడిపి గ్రామానికి చెందిన రైతు గుర్రం శేషగిరి రావు మూడెకరాల పొలంలో అరటి పంట సాగు చేస్తున్నారు. అయితే... ఆదివారం సాయంత్రం ఓ రైతు తన పొలంలోని చెత్తకు నిప్పుపెట్టాడు. ఈ సమయంలో ఈదురుగాలులు వచ్చి పక్కనే ఉన్న శేషగిరి రావు అరటితోటకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల వరకు పంట నష్టం జరగిందని రైతు వాపోయాడు. అలాగే... పక్కనే ఉన్న ద్విచక్ర వాహనం కూడా పూర్తిగా దగ్ధమైంది.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మండలంలోని మేడిపి గ్రామానికి చెందిన రైతు గుర్రం శేషగిరి రావు మూడెకరాల పొలంలో అరటి పంట సాగు చేస్తున్నారు. అయితే... ఆదివారం సాయంత్రం ఓ రైతు తన పొలంలోని చెత్తకు నిప్పుపెట్టాడు. ఈ సమయంలో ఈదురుగాలులు వచ్చి పక్కనే ఉన్న శేషగిరి రావు అరటితోటకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల వరకు పంట నష్టం జరగిందని రైతు వాపోయాడు. అలాగే... పక్కనే ఉన్న ద్విచక్ర వాహనం కూడా పూర్తిగా దగ్ధమైంది.

ఇవీ చూడండి: చెరువులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.