ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్ : ప్రకాశంలో అధికారుల అప్రమత్తం

author img

By

Published : Apr 6, 2020, 2:25 PM IST

ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులతో.. జిల్లా యంత్రంగా అప్రమత్తమయ్యింది. ఈ మేరకు జిల్లాలో తీసుకోవల్సిన చర్యపై.. జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఏప్రిల్​ 14 వరకూ లాక్​డౌన్​ని కఠినంగా అమలు చేయాలని సూచించారు.​

due to corona prakasham district Collector Paola Bhaskar  meeting with officials for lockdown
due to corona prakasham district Collector Paola Bhaskar meeting with officials for lockdown

ప్రకాశం జిల్లా చీరాలలో లాక్​డౌన్​ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. చీరాల, కుంకలమర్రులో ఆదివారం కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కారంచేడులోని అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 14 వరకూ లాక్​డౌన్​ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. కర్ఫ్యూకి ప్రజలంతా సహకరించాలని చీరాల సీఐ ఎన్. నాగమల్లేశ్వరరావు కోరారు. అనవసరంగా ఎవరైనా రహదార్లపైకి వస్తే వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ప్రకాశం జిల్లా చీరాలలో లాక్​డౌన్​ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. చీరాల, కుంకలమర్రులో ఆదివారం కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కారంచేడులోని అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 14 వరకూ లాక్​డౌన్​ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. కర్ఫ్యూకి ప్రజలంతా సహకరించాలని చీరాల సీఐ ఎన్. నాగమల్లేశ్వరరావు కోరారు. అనవసరంగా ఎవరైనా రహదార్లపైకి వస్తే వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: చీరాలలో ప్రశాంతంగా లాక్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.