ETV Bharat / state

MLA Dola Fire on Police: హనుమాయమ్మది ముమ్మాటికి రాజకీయ హత్యే.. పోలీసుల మాటలు శోచనీయం: ఎమ్మెల్యే డోలా

author img

By

Published : Jun 8, 2023, 1:40 PM IST

Kondipi MLA Dola Veeranjaneya Swamy fire on police: హనుమాయమ్మ హత్య కేసుకు సంబంధించి పోలీసులు చెప్పిన మాటలు శోచనీయమని.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ హత్యేనని ఆయన ఆరోపించారు. ఘటనపై పోలీసులు, ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

MLA Dola
MLA Dola
హనుమాయమ్మది ముమ్మాటికి రాజకీయ హత్యే..ఎమ్మెల్యే డోలా

Kondipi MLA Dola Veeranjaneya Swamy fire on police: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామానికి చెందిన సవలం సుధాకర్‌ భార్య సవలం హనుమాయమ్మను తాజాగా అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సవలం కొండలరావు ట్రాక్టర్‌తో ఢీకొట్టి అతికిరాతంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హనుమాయమ్మ మృతికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు చెప్పిన మాటలు చాలా శోచనీయమని.. కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులపై కొండపి ఎమ్మెల్యే డోలా ఆగ్రహం.. ఈ సందర్భంగా కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి సవలం సుధాకర్‌ భార్య హనుమాయమ్మ హత్య ఉదంతంపై మాట్లాడుతూ..''టంగుటూరు మండలం రావివారిపాలేనికి చెందిన సవలం సుధాకర్‌ భార్య సవలం హనుమాయమ్మ(50) హత్యపై పోలీసులు చెప్తున్న మాటలు చాలా శోచనీయంగా ఉన్నాయి. హనుమాయమ్మ హత్య రాజకీయాలకు సంబంధంలేదని.. ఇది పూర్తిగా కుటుంబ కలహాల వల్లే జరిగిందని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వాళ్ల మీద కుటుంబ కలహాలు ఉన్నాయి. దూరపు బంధుత్వాలున్నాయి. కానీ, చంపినటువంటి వ్యక్తి (ముద్దాయి) ఎవరైతే ఉన్నారో.. ఆ వ్యక్తి కొద్ది రోజులక్రితం..'నా పార్టీ నాకు అండగా ఉంది. నేను మీ అంతు తేల్చుతాను' అంటూ చెప్పాడు. ఆ మాటల్ని పోలీసులు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు..?, అధికార పార్టీ ఒత్తిడికి పోలీసులు ఎందుకు లొంగారు..?, రాత్రివరకూ ముద్దాయి దొరకలేదన్నారు. నిన్న ముద్దాయి దొరికిన తర్వాత అప్పటికప్పుడు విచారణ ఎప్పుడు పూర్తి చేశారు..?'' అని ఆయన అన్నారు.

హనుమాయమ్మది ముమ్మాటికి రాజకీయ హత్యే.. అనంతరం అధికార పార్టీ వాళ్లను కాపాడే ప్రయత్నాలు పోలీసులకు బాగా అలవాటైపోయాయని.. కొండపి ఎమ్మెల్యే డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు. సవలం హనుమాయమ్మ హత్య ముమ్మాటికి రాజకీయ హత్యేనని ఆయన వ్యాఖ్యానించారు. నిష్పక్షపాతంగా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని.. ఎమ్మెల్యే డోలా డిమాండ్ చేశారు. హనుమాయమ్మ హత్య కేసులో రాజకీయ పార్టీల ప్రమేయం లేదనడం అమానుషమని మండిపడ్డారు.

నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలి.. హనుమాయమ్మను హత్య చేసింది వైసీపీ నాయకుడు కొండలరావేనని.. మృతురాలి భర్త, కుమార్తె, కుటుంబ సభ్యులు చెబుతున్నా.. పోలీసులు ఎందుకు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవడంలేదని.. కొండపి ఎమ్మెల్యే డోలా దుయ్యబట్టారు. కొండ నాయుడు పాలెం నుంచి టంగటూరుకు వెళ్లే సమయంలో వైసీపీ నాయకులు అఘాయిత్యానికి పాల్పడితే.. టీడీపీ వారిపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు కానీ.. వైసీపీ నేతపై ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ నాయకుడు చంద్రబాబు నాయుడు కోరినట్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థలచే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందని డోలా బాలవీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు.

హనుమాయమ్మది ముమ్మాటికి రాజకీయ హత్యే..ఎమ్మెల్యే డోలా

Kondipi MLA Dola Veeranjaneya Swamy fire on police: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామానికి చెందిన సవలం సుధాకర్‌ భార్య సవలం హనుమాయమ్మను తాజాగా అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సవలం కొండలరావు ట్రాక్టర్‌తో ఢీకొట్టి అతికిరాతంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హనుమాయమ్మ మృతికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు చెప్పిన మాటలు చాలా శోచనీయమని.. కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులపై కొండపి ఎమ్మెల్యే డోలా ఆగ్రహం.. ఈ సందర్భంగా కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి సవలం సుధాకర్‌ భార్య హనుమాయమ్మ హత్య ఉదంతంపై మాట్లాడుతూ..''టంగుటూరు మండలం రావివారిపాలేనికి చెందిన సవలం సుధాకర్‌ భార్య సవలం హనుమాయమ్మ(50) హత్యపై పోలీసులు చెప్తున్న మాటలు చాలా శోచనీయంగా ఉన్నాయి. హనుమాయమ్మ హత్య రాజకీయాలకు సంబంధంలేదని.. ఇది పూర్తిగా కుటుంబ కలహాల వల్లే జరిగిందని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వాళ్ల మీద కుటుంబ కలహాలు ఉన్నాయి. దూరపు బంధుత్వాలున్నాయి. కానీ, చంపినటువంటి వ్యక్తి (ముద్దాయి) ఎవరైతే ఉన్నారో.. ఆ వ్యక్తి కొద్ది రోజులక్రితం..'నా పార్టీ నాకు అండగా ఉంది. నేను మీ అంతు తేల్చుతాను' అంటూ చెప్పాడు. ఆ మాటల్ని పోలీసులు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు..?, అధికార పార్టీ ఒత్తిడికి పోలీసులు ఎందుకు లొంగారు..?, రాత్రివరకూ ముద్దాయి దొరకలేదన్నారు. నిన్న ముద్దాయి దొరికిన తర్వాత అప్పటికప్పుడు విచారణ ఎప్పుడు పూర్తి చేశారు..?'' అని ఆయన అన్నారు.

హనుమాయమ్మది ముమ్మాటికి రాజకీయ హత్యే.. అనంతరం అధికార పార్టీ వాళ్లను కాపాడే ప్రయత్నాలు పోలీసులకు బాగా అలవాటైపోయాయని.. కొండపి ఎమ్మెల్యే డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు. సవలం హనుమాయమ్మ హత్య ముమ్మాటికి రాజకీయ హత్యేనని ఆయన వ్యాఖ్యానించారు. నిష్పక్షపాతంగా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని.. ఎమ్మెల్యే డోలా డిమాండ్ చేశారు. హనుమాయమ్మ హత్య కేసులో రాజకీయ పార్టీల ప్రమేయం లేదనడం అమానుషమని మండిపడ్డారు.

నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలి.. హనుమాయమ్మను హత్య చేసింది వైసీపీ నాయకుడు కొండలరావేనని.. మృతురాలి భర్త, కుమార్తె, కుటుంబ సభ్యులు చెబుతున్నా.. పోలీసులు ఎందుకు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవడంలేదని.. కొండపి ఎమ్మెల్యే డోలా దుయ్యబట్టారు. కొండ నాయుడు పాలెం నుంచి టంగటూరుకు వెళ్లే సమయంలో వైసీపీ నాయకులు అఘాయిత్యానికి పాల్పడితే.. టీడీపీ వారిపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు కానీ.. వైసీపీ నేతపై ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ నాయకుడు చంద్రబాబు నాయుడు కోరినట్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థలచే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందని డోలా బాలవీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.