ETV Bharat / state

బెస్తవారిపేటలో పిచ్చికుక్క బీభత్సం.. 25 మందికి గాయాలు

ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. పిచ్చి కుక్క దాడిలో 25 మంది గాయపడ్డారు. బాధితులను మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

author img

By

Published : Aug 30, 2021, 3:50 PM IST

పిచ్చికుక్క స్వైర విహారం
పిచ్చికుక్క స్వైర విహారం

ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. స్థానిక ఎంపీపీ కార్యాలయం వద్ద ఆ మార్గంలో వచ్చిపోయేవాళ్లపై విరుచుకుపడింది. దొరికిన ప్రతి ఒకరిపై దాడి చేసింది. శునకం దాడిలో 25 మంది వరకు గాయపడ్డారు. వాళ్లలో పిల్లలు, పెద్దలు ఉన్నారు. బాధితులను మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కుక్క దాడిలో 10 మందికి తీవ్రగాయాలు కాగా.. సాలమ్మ అనే మహిళ వేలు తెగిపోయింది. పలువురికి వివిధ శరీర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామస్థులు.. పిచ్చికుక్కను కర్రలతో కోట్టి చంపారు. బెస్తవారిపేటలో కుక్కల బెడద ఇటీవల ఎక్కువైందని స్థానికులు వాపోయారు. కుక్కల నివారణకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. స్థానిక ఎంపీపీ కార్యాలయం వద్ద ఆ మార్గంలో వచ్చిపోయేవాళ్లపై విరుచుకుపడింది. దొరికిన ప్రతి ఒకరిపై దాడి చేసింది. శునకం దాడిలో 25 మంది వరకు గాయపడ్డారు. వాళ్లలో పిల్లలు, పెద్దలు ఉన్నారు. బాధితులను మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కుక్క దాడిలో 10 మందికి తీవ్రగాయాలు కాగా.. సాలమ్మ అనే మహిళ వేలు తెగిపోయింది. పలువురికి వివిధ శరీర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామస్థులు.. పిచ్చికుక్కను కర్రలతో కోట్టి చంపారు. బెస్తవారిపేటలో కుక్కల బెడద ఇటీవల ఎక్కువైందని స్థానికులు వాపోయారు. కుక్కల నివారణకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి..

Tollywood Drugs case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రేపట్నుంచి ఈడీ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.