రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు పశ్చిమ్బంగ నుంచి రాష్ట్రానికి బయల్దేరిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ కృష్ణపట్నం చేరుకుంది. రెండు కంటైనర్లలో 40 మెట్రిక్ టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ను తీసుకువచ్చిన ఈ రైలు... 27 గంటల్లో గమ్యస్థానానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేయడం వల్ల ఈ రైలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని వివరించారు. ఈ నెలాఖరులో 76.39 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ నాలుగు కంటైనర్ ట్యాంకర్లతో గుంటూరుకు చేరుకుంటుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.
ఇదీచదవండి.